సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం తహసిల్దార్ భగవాన్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మోతి గడ్డ వీరభద్ర స్వామి వారి దేవస్థానం నందు జరుపబడు మహా శివరాత్రి జాతర ఏర్పాట్ల గురించి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ పోలీసు శాఖ పంచాయతీరాజ్ శాఖ ఎక్సైజ్ శాఖ విద్యుత్ శాఖ మరియు గ్రామపంచాయతీ సెక్రెటరీ మోతీ పట్టి నగర్ దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి జి సుదర్శన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కొత్తగూడెం డివిజన్ ఇన్స్పెక్టర్ బెల్ సింగ్ పాల్గొన్నారు మరియు ఇట్టి సమావేశమునకు బూర్గంపాడు సొసైటీ చైర్మన్ బిక్కసాని మరియు గ్రామ సర్పంచ్ సూరమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల వారు చేయవలసిన పనుల గురించి తాసిల్దార్ శ్రీ భగవాన్ రెడ్డి జాతర జరుగు సమయంలో అన్ని శాఖల వారు అప్రమత్తంగా ఉండాలని తగు సూచనలు జారీ చేసి ఉన్నారు....
-----------------------
Admin