సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : * ప్రజా పాలన విజయోత్సవ సభ మరియు ర్యాలికి జిల్లాలోని అన్ని మండలాల నుండి మహిళా నాయకులు భారీగా తరలి వచ్చి ర్యాలిని మరియు సభను విజయవంతం చేయాలని కోరుతూ... తేది: 29.11.2024 శుక్రవారం అనగా రేపు మధ్యాహ్నం 12:00 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న శుభసందర్భంగా జూనియర్ కళాశాల నుండి డి.ఎల్.ఆర్. గార్డెన్స్ వరకు ఏర్పాటు చేసిన ప్రజా విజయోత్సవ ర్యాలీ మరియు అనంతరం గార్డెన్స్ యందు విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఇట్టి సభకు ముఖ్య అతిథులుగా మన ప్రియతమ నేత, తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖా మాత్యులు శ్రీమతి గౌరవ దనసరి అనసూయ సీతక్క గారు, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు, తెలంగాణ రాష్ట్ర యువజన కార్యదర్శి దనసరి సూర్య గారు, ములుగు జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు బానోత్ రవిచందర్ గారు విచ్చేయనున్నారు. కావున ములుగు జిల్లాలోని అన్ని మండలాల నుండి మహిళా నాయకులు భారీగా తరలి వచ్చి ప్రజా విజయోత్సవ ర్యాలీ మరియు సభను విజయవంతం చేయాలని కోరుతూ... మీ, రేగ కళ్యాణి , మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ములుగు జిల్లా
-----------------------
Admin