Wednesday, 29 July 2026 04:28:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రతి జిల్లాలో గౌడ్స్ కు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి...

Date : 30 August 2023 02:30 AM Views : 378

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ తెలంగాణలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నూటికి ఇరవై ఐదు శాతం ఉన్న గౌడ్స్ కి ప్రతి జిల్లాకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నాయకులు సూర్యాపేట జిల్లా ప్రధానకార్యదర్శి గుండు రాంబాబుగౌడ్,నియోజకవర్గ అధ్యక్షులు జనిగల శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి తండు వెంకన్న గౌడ్,గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు యరగాని కిరణ్ గౌడ్, అన్ని రాజకీయాపార్టీలను విజ్ఞప్తి చేశారు.తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హుజూర్ నగర్ పట్టణం టౌన్ హాల్ లో జరిగిన గౌడ అఖిలపక్ష మీటింగ్ లో మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో టికెట్స్ విషయంలో అన్యాయం జరుగుతుంది అని ఈసారి ఇవ్వకపోతే ప్రతి నియోజకవర్గం నుండి గౌడును పోటీకి పెట్టి గెలిపించుకుంటామని తెలిపారు. అదేవిదంగా గౌడులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు తో బాటు దళిత బందు మాదిరిగానే గౌడ బందు ఏర్పాటు చేయాలి అని, సాధారణముగా మరణించిన గీత కార్మికులకు పది లక్షలు బీమా ఇవ్వాలి అని, గీతన్నలకు, సెప్టిమొకూ లతోపాటు, మోటర్ బైక్ లు ఇవ్వాలి అని, తాటి ఈత వనమును పెంచుకునుటకు ప్రతి గ్రామంలో ఐదు ఎకరాల భూమి కేటాయించి, వాటి సంరక్షణ ప్రభుత్వమే చేపట్టాలని కోరారు. వీటితో పాటు ప్రతి నియోజకవర్గంలో గౌడ సంక్షేమ భవన్ ఏర్పాటు చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు గండు అర్జున్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి వల్లపుదాసు నాగరాజు గౌడ్,పట్టణ ఉపాధ్యక్షులు ఓరుగంటి రామకృష్ణ గౌడ్, మధు గౌడ్,బత్తిని మల్లయ్య గౌడ్,బెల్లంకొండ శ్రీను గౌడ్, బత్తిని ఉదయ్ కుమార్ గౌడ్,గండు వెంకట్ గౌడ్, నాల్లపటి సైదులు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :