సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ జాయింట్ సెక్రటరీ బి. బాలాజీ రామ్ నాయక్ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ను హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసి గిరిజనుల సమస్యలపై వినతిపత్రం శుక్రవారం అందజేశారు. బాలాజీ రామ్ నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హైదరాబాద్ లో నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్, ఆదివాసీ భవన్ లో ఎంట్రీ ఫీజు 60,000 రూపాయలు ఎక్కువ మొత్తంలో ఉండడంతో, ఎలాంటి కార్యక్రమాలు చేయాలన గిరిజనులు అంత మొత్తంలో చెల్లించలేరు కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తగ్గించాలని కొరాడం జరిగిందని, అలాగే గిరిజనుల రిజర్వేషన్ 10శాతం కాకుండా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ పెంచాలని, రాష్ట్రంలో లంబాడీల సమస్యలపై గవర్నర్ కు వివరించడం జరిగిందని, అలాగే గవర్నర్ మా యొక్క వినతి పత్రం స్వీకరించి సానుకూలంగా స్పందించారని తెలిపారు...
-----------------------
Admin