సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలో ఈడెన్ ప్లాజా ఫంక్షన్ హాలులో ఖైర్ ఉల్ మోమినిన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తలసేమియా బాధితులకు రక్తదానం చేయడం ప్రాణదానం చేసినంత పుణ్యం లభిస్తుందని రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది అభాగ్యులకు, పేదలకు సహాయం చేసిన వారం అవుతామని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 280 మంది యువకులు రక్తదానం చేశారని అన్నారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేసి తలసేమియా బాధితులను ఆదుకోవాలని అన్నారు. జీవితంలో ఏది శాశ్వతం కాదు మనం చేసిన పుణ్య కార్యమే మనకు ప్రతిఫలం ఇస్తుంది. మనం చేసే ఈ పుణ్య కార్యక్రమంతో ఒక జీవితాన్ని నిలబెట్టిన వారం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖైర్ ఉల్ మొమీనీన్ ట్రస్టు సభ్యులు, మీడియా సీనియర్ జర్నలిస్టులు, ఎంపీపీ, జడ్పిటిసి, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్, యువ సత్తా అధ్యక్షుడు, వివిధ పార్టీల నాయకులు, యువకులు, డాక్టర్లు, సిబ్బంది, పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin