సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా : ఏప్రిల్ 23 సర్కార్ టీవీ దేశ ప్రజలు ముచ్చటగా మూడవసారి బి జె పి కేద్రంలో ప్రధాన మంత్రి మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మఠంపల్లి మండల బి జె పి ఉపాధ్యక్షుడు సంపతి ఆదినారాయణ యాదవ్ అన్నారు. సోమవారం నల్గొండ లో పార్టీ యంపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయినదని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మేపరిస్థితిలో లేదని అందుకే ప్రజలు ముచ్చటగా మూడోసారి దేశప్రధానిగా మోదీ నాయకత్వన్ని కోరుకుంటున్నారని అన్నారు. బి జె పి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ని యం పి గా గెలిపించుకుంటే హుజుర్ నగర్ నియోజకవర్గానికి ప్యాసింజర్ రైలు తెప్పిస్తారని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పధకాలు మనకు అందుతాయని అన్నారు. అనంతరం పార్టీ యం పి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కి శుభాకాంక్షలు తెలిపినారు. అదేవిధంగా ఇద్దరు ముఖ్యమంత్రుల అభ్యరులను శాసనసభ ఎన్నికల్లో మట్టికరిపించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
-----------------------
Admin