సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని మిర్యాలగూడ క్రాస్ రోడ్ నుంచి గాంధీ పార్క్ వరకు ఉత్సాహంగా కొనసాగిన 2కె రన్ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతినిత్యం ఈ 2k రన్ లాగానే అభివృద్ధిని కూడా దశాబ్ద కాలం నుంచి పరుగులు పెట్టిస్తూ ఎన్నో అద్భుతాలను తెలంగాణలో సృష్టించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఔరా అనిపించినది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బంగారు తెలంగాణలో హుజూర్ నగర్ నియోజకవర్గం ఒక కలికి తురాయి - కేవలం మూడు సంవత్సరాల లోనే 30 సంవత్సరాల అభివృద్ధిని సాధించి ఎన్నో రంగాలలో ఈరోజు బాగా అభివృద్ధి చెందిన నగరాల తో పోటీ పడుతుంది ఇప్పటివరకు 3500 కోట్ల రూపాయల నిధుల అభివృద్ధితో రూపొందించిన అభివృద్ధి పనులు హుజూర్నగర్ ని తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకునేలా చేసింది.రానున్న రెండు లేదా మూడు నెలలు అన్ని పనులను పూర్తి చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకొని ఖచ్చితంగా అభివృద్ధిని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది మరియు హామీలో చెప్పని ఎన్నో పనులను కూడా నిత్యం చేసి చూపిస్తున్నాం హుజూర్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి మరియు సంక్షేమం ఈ 2K రాన్ లాగానే నిత్యం పరుగులు పెట్టిస్తున్నామని కాలంతో పాటు పోటీపడి పని చేస్తున్నామని రాజకీయాలు కేవలం ప్రజా సేవకు మాత్రమేనని ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం మనందరికీ గర్వకారణం అని ఈ సందర్భంగా శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి తెలియజేశారు. ఈ 2k రన్ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు మరియు పోలీస్ ఉన్నతాధికారులు యువకులు, కార్యకర్తలు స్కూల్ మరియు కాలేజీ విద్యార్థులు ప్రజలు భారీగా పాల్గొన్నారు.
-----------------------
Admin