సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలంలోని కర్ని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మక్తల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు , ముఖ్య నాయకుల సమన్వయంతో శ్రీ శ్రీ శ్రీ గుంటిరంగస్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రైతు సోదరులు మరియు పార్టీ శ్రేణులు కేక్ కట్ చేస్తూ బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నిరంతరం రోజుకు 18 గంటలు పనిచేస్తూ అభివృద్ధి కొరకు శ్రమిస్తూ త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం గ్రామీణ రోడ్ల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ గ్రామీణ ప్రాంతంలో నీటి ఎద్దడి తీరడం కొరకై పలు గ్రామాల్లో బోర్లు వేయించిన ప్రజల నీటి ఎద్దడిని తొలగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మక్తల్ మండల అధ్యక్షుడు గణేష్ కుమార్, కట్ట సురేష్, రవి కుమార్ కర్ని గ్రామ నాయకులు దామ్మోళ్ల క్రిష్ణయ్య గౌడ్ మాజీ ఉపసర్పంచ్, ఈద బీమెష్, గాసం నరసింహ, ఊట్కూరు శ్రీను, వాకిటి హన్మంత్, డి శ్రీను, కటికె మైబు, నజిముద్దీన్, మహిబుబ్ పాషా, రాధా దత్తురాం మాజీ ఎంపీటీసీ, డబ్బ మల్లేష్, ఎద్దుల చిన్న హన్మంత్, కటికెళి హన్మంత్, కటికెళి పాండు, గాసం భాగవంత్ , శాపలి కరెప్ప, సద్ధముహుస్సేన్, పంది భాలస్వామి పార్టీ కార్యకర్తలు వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin