సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతులు మీదుగా మహోన్నత సేవా పతకం, ఉత్తమ సేవా పతకం సేవ పతకాలను అందుకున్న పోలీసు అధికారులను మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నిజాయితీగా కష్టపడి పనిచేసే పోలీస్ అధికారులకు శాఖా పరమైన గుర్తింపుతో పాటు ప్రభుత్వ నుండి పతకాలు కూడా అందుతాయని పోలీస్ కమిషనర్ తెలియజేశారు.పతకాలను అందుకున్న వారిలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ మహోన్నత సేవ పతకాన్ని అందుకోగా, ఉత్తమ సేవా పతకాలను క్రైమ్ ఏసీపీ సదయ్య, ఎస్. ఐ వేణుగోపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేష్, సేవా పతకాలను ఎస్. ఐ కనకచంద్రం, ఏ.ఎస్. ఐలు జయదేవ్, పాపయ్య, చేరాలు, అర్జున్, శ్యాం సుందర్, హెడ్ కానిస్టేబుళ్ళు అమీర్ పాషా, నర్సింగ రావు, స్వర్ణ లత వున్నారు.
-----------------------
Reporter