సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర క్రీడాకా అధికార సంస్థ ఆదేశానుసారం ఈరోజు జిల్లా కలెక్టర్ బసంత కుమార్ జగనన్న క్రీడా సంబరాలు లోగోను స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాల్ నందు ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా నాలుగు (క్రికెట్ షటిల్ బ్యాడ్మింటన్,వాలీబాల్ మరియు కబడ్డీ) అంశాలలో మొదటిసారిగా సుమారు 50 లక్షలు ప్రైజ్ మనీ తో డిసెంబర్ 21వ తారీఖున రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించడం జరుగుతుంది .ఇందుకుగాను ప్రతి నియోజకవర్గంలోనూ ఎంపికలు నిర్వహించిజిల్లాస్థాయి జోనల్ సాయి మరియు రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించబడును రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన టీములకు ప్రైజ్ మనీ ఇవ్వబడును. ఇందులో భాగంగా ప్రతి ప్లేయర్ జగనన్న స్పోర్ట్స్ క్లబ్ లో మెంబరే ఉండవలెను కావున మండల స్థాయిలోను మరియు నియోజకవర్గస్థాయిలో గల క్రీడాకారులు అందరూ ఈ జగనన్న స్పోర్ట్స్ క్లబ్బులు మెంబర్లుగా నమోదు చేసుకోనవలెను. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య, ఆర్డిఓ భాగ్యరేఖ, జిల్లా క్రీడా సాధికార సంస్థ ముఖ్య శిక్షకులు కె. జగన్నాథరెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin