సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : గృహజ్యోతి పథకం ద్వారా ప్రభుత్వం నుండి ఉచితంగా విద్యుత్ పొందుతున్న వినియోగదారులకు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నూతన సంవత్సరం సందర్భంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందుతున్న లబ్ధిదారులకు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పంపించిన సందేశ లేఖలను గుడమహేశ్వరం సర్పంచ్ కూరతోట స్వప్న సురేష్ ఆధ్వర్యంలో లైన్మెన్ రాజు ఏఎల్ఎం స్వామి,ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు సందేశ లేఖలను అందజేశారు.
-----------------------
Reporter