సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : మండల పరిధిలోని మల్లారం దాని చుట్టుపక్కల 8 గ్రామాలకు సాగునీరు అందించే పీసువాగు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారని బీఎస్పీ కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి యెర్రా కామేష్ ప్రశ్నించారు???మన కొత్తగూడెం-మన కామేష్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉల్వనూర్,గంగాదేవి గుప్ప,కొత్తబంజర,పాతబంజరలో పర్యటించి ఓటర్లను ఓట్లు అభ్యర్దించారు.గ్రామస్తులతో కలిసి పీసువాగు ప్రాంతాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ 1989లో రూ.34 లక్షలు మంజూరు చేసి 33 ఏళ్ళుగా నలుగురు ఎమ్మెల్యేలు మారినా నేటికి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.పీసువాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే మల్లారం,నర్సింహాసాగర్,లక్ష్మీదేవిపల్లి,బంజర,గుండ్లమాడుగు తదితర గ్రామాల్లోని సుమారు ఐదువేల ఎకరాలకు సాగునీరు అందుతుందని,రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.గిరిజనుల పట్ల వైఖరికి పీసువాగు నిర్మాణమే నిదర్శనమన్నారు.కొత్తగూడెంలో బీఎస్పీ గెలిచిన ఆరు నెలల్లో పీసువాగు ప్రాజెక్టు పనులను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో మండల,పట్టణ అధ్యక్షులు కాటబోయిన వసుంధర,కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,జిల్లా మహిళా అధ్యక్షురాలు బండి రమణి,అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు కోలా మల్లికా,ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin