సర్కార్ టీవీ న్యూస్ / ఢిల్లీ : మోదీ ప్రభుత్వం ప్రకటించిన లక్షపతి దీదీ యోజన పథకం కింద మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు మంజూరు చేస్తారు. రుణ పరిమితి రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ ఉంటుంది. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అందిస్తోంది. అయితే స్వయం సహాయక బృందం (ఎస్ హెచ్ జీ)లో సభ్యులుగా ఉన్న మహిళలకు మాత్రమే ఈ రుణం మంజూరు చేస్తారు.ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. మహిళ అభ్యున్నతి సాధిస్తే ఆ కుటుంబం, అలాగే సమాజం కూడా ప్రగతి పథంలో పయనిస్తుంది. అందుకే మహిళా సంక్షేమానికి, వారి ఆర్థిక ఉన్నతికి ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వాటి ద్వారా స్త్రీలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రోత్సహిస్తున్నాయి. వివిధ శిక్షణ కార్యక్రమాలతో వారికి ఉపాధి కల్పిస్తున్నాయి. అన్ని విధాలా అండగా నిలబడుతున్నాయి. ఇదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2023లో ఢిల్లీలో మహిళల కోసం లక్షపతి దీదీ యోజన అనే పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా మహిళలను లక్షాధికారులను చేయాలన్నదే ఆయన లక్ష్యం. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి శిక్షణ ఇస్తారు. తమ కాళ్లపై నిలబడేలా ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక సాయం అందజేస్తారు. తద్వారా వారు ఆదాయ వనరులను కల్పించుకోవడానికి, పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్షపతి దీదీ యోజన పథకం అంటే ఏమిటి? దానిలో ప్రయోజనాలు ఏమిటి? అర్హతలు ఏమిటి? తెలుసుకుందాం రండి...
-----------------------
Admin