సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి పట్టణంలో స్థానిక రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాయలసీమ విద్యార్థి యవజన సంఘం రాష్ట అధ్యక్షులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ బ్లూ మూన్ కళాశాల చైర్మన్ శివశంకర్ గతంలో బి. మణి కుమార్ నాయక్ అనే గిరిజన విద్యార్థికి సర్టిఫికెట్ ఇవ్వకుండా అన్యాయం చేయడం పైన కదిరి ఎమ్మార్వో కి మరియు ఆర్డీవో కి, కలెక్టర్ కి ,ఆర్ఐఓ కి మరి కొంతమంది అధికారులకు ఈ విషయంపై అనేక సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది.కానీ ఏ అధికారి కూడా ఈ విషయం పై స్పందించలేదు. కానీ ఇప్పటికైనా అధికారుల స్పందించి బి మణికుమార్ నాయక్ అనే విద్యార్థికి న్యాయం చేయకపోతే ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మార్వో లేదా కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరిస్తున్నాం.అదేవిధంగా భవిష్యత్తులో ఏ విద్యార్థికి అన్యాయం చేయకుండా ఉండే విధంగా బ్లూ మాన్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి యవజన సంఘం రాష్ట అధ్యక్షులు అరుణ్ కుమార్ ఏ ఐ ఎస్ ఏ జిల్లా ఆర్గనేజిగ్ కార్యదర్శి నరసింహ బహుజన విద్యార్థి సంగం కదిరి నియోజకవర్గ అధ్యక్షులు అనిల్ మరియు రాయలసీమ మహిళ సంఘం జిల్లా కార్యదర్శి సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin