సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్సీ టీపీసీసీ ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరావు ఆధ్వర్యంలో మొహమ్మద్ ఉస్మాన్, సాయి రంజిత్ నాయకత్వంలో యువత కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమం మున్సిపాలిటీలోని 34 వార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సభ అధ్యక్షుడు పోట్ల నాగేశ్వరావు మాట్లాడుతూ కొత్తగూడెం అభివృద్ధి లక్ష్యం. ప్రతి పేదవాడికి ,ఇల్లు, విద్య, ఉచితంగా అందించడమే నా దేయం. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యవసర ధరలను విపరితంగా పెంచడం సామాన్యుడికి భారమైపోయింది అన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని మోసం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాబోయే రోజుల్లో కేంద్రాన్ని రాష్ట్రాన్ని పాలించేది కాంగ్రెస్ పార్టీ ప్రజలు చైతన్యవంతులయ్యారు కాంగ్రెస్ పాలనల్లో అనేక సంక్షేమ పథకాలు ఉండేవి బిఆర్ఎస్ పాలనలో లేవు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ జె బి శౌరి, టిపిసిసి సభ్యులు ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు మాళోత్ రాందాస్ నాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏనుగుల అర్జున్ రావు, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి వీరాపురం రామలక్ష్మణ్ రావు, చుంచుపల్లి మండల అధ్యక్షుడు పెగడ బిక్షపతి, గరీభ్ పేట ఎంపిటిసి కసనబోయిన భద్రం, మైనారిటీ సెల్ నాయకులు గౌస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏలూరి రాందాస్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దావుద్, షబానా, జిల్లా విద్యార్థి నాయకుడు అజ్మీర సురేష్, కొమరయ్య, దుర్గ, భట్టు మురళి, వెంకట్, హేమంత్, రంజిత్, గుణ,సునే, చిన్నా,యునిష్, నాగేందర్, పవన్, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin