Wednesday, 29 July 2026 08:18:56 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గాలిపటం మాంజా దారానికి బలైన ఆర్మీ జవాన్...

Date : 16 January 2024 02:18 PM Views : 680

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాదులో గాలిపటం మాంజా దారానికి బలై ప్రాణాలు కోల్పోయిన.. ఆర్మీ జవాన్ కోటేశ్వర్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు. విశాఖలో అంతిమయాత్రకు కుటుంబ సభ్యులు, అభిమానులు, స్థానికులు భారీగా హాజరయ్యారు. గోల్కొండ మిలటరీ హాస్పిటల్ నుంచి వచ్చిన సిబ్బంది కూడా అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతదేహానికి ఆర్మీ అధికారులు నివాళులర్పించారు. గౌరవ వందనం సమర్పించి.. సైనిక లాంచనాలతో జాతీయ జెండాను జవాన్ సతీమణికి అందించారు. జవాన్ కోటేశ్వర్ రెడ్డికి చెందిన నాలుగు తరల వాళ్లు ఆర్మీలో పని చేశారు. అదే స్ఫూర్తితో కోటేశ్వర్ రెడ్డి కూడా ఆర్మీలో చేరారు. రిపబ్లిక్ డే నాడు జన్మించారు కోటేశ్వర్ రెడ్డి. కూతురు కూడా స్వాతంత్ర దినోత్సవం నాడు పుట్టింది. ఇటీవల ఆమె తొలి పుట్టిన రోజు వేడుకలకు కూడా ఘనంగా చేశారు కోటేశ్వర్ రెడ్డి. ఆర్మీ డ్రెస్ అంటే ఎనలేని అభిమానం గౌరవం. ఆ డ్రెస్ లోనే వెళుతుండగా.. ఆర్మీ జవాన్ కోటేశ్వర్ రెడ్డి మాంజా దారానికి బలై ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ మెడికల్ కోర్ టీంలో కోటేశ్వర్ రెడ్డి నాయక్ గా పని చేస్తున్నారు. గోల్కొండ మిలటరీ హాస్పిటల్ లో నాయక్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :