Wednesday, 29 July 2026 01:18:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పట్టాల ఎంక్వేరీలో నిబంధనలను తొలగించాలి... - సిపిఐ పట్టణ కార్యదర్శి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వై శ్రీనివాస్ రెడ్డి

Date : 29 August 2023 08:12 AM Views : 232

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : అర్హులందరికీ తక్షణమే పట్టాల పంపిణీ పూర్తి చేయాలి... సిపిఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం పట్టణంలో జీవో నెంబర్ 76 ద్వారా పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ తక్షణమే పట్టాలు అందజేయాలని, సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వై. శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న పట్టాల ఎంక్వైరీలో ఎన్ఓసి ఇవ్వాలని, అఫిడవిట్ సమర్పించాలని, అట్లాగే ఇంటి స్థలాల విక్రయదారుల సంతకాలు వాంగ్మూలం ఇవ్వాలని, వారసత్వ వాటా ఆస్తి అయితే కుటుంబ సభ్యుల ధ్రువీకరణ కావాలని తదితర ఆంక్షలు అధికారులు విధించడం సరికాదని శ్రీనివాస్ రెడ్డి వివరించారు. క్రమబద్ధీకరణ పట్టాల విషయంలో దరఖాస్తు దారుల ఆందోళన, ఇబ్బందులు, అధికారులు విధించిన నిబంధనలను స్థానిక కొత్తగూడెం తాసిల్దార్ పుల్లయ్య గారిని కలిసి సిపిఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ నాయకులు వినతి పత్రం అందించి సమస్యలను వివరించారు. స్థలాలు అమ్మిన వారి సంతకాలు కావాలని నిబంధన పెడితే డబ్బులు డిమాండ్ చేస్తారని, ఘర్షణలు జరుగుతాయని వివరించారు. గతంలో ఇటువంటి నిబంధనలు లేవని చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ పుల్లయ్య గారు మాట్లాడుతూ స్థలాల విక్రయదారుల సంతకాలు వాంగ్మూలాలు... నిబంధనలను తొలగిస్తామని, అర్హులందరికీ త్వరలోనే పట్టాలు పంపిణీ చేపట్టి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్ జిల్లా అధ్యక్షులు బోయిన విజయకుమార్ 18 వ వార్డు కౌన్సిలర్ పి సత్యనారాయణ చారి 11వ వార్డు కౌన్సిలర్ టిజిఎస్ జిల్లా అధ్యక్షులు భూక్య శ్రీనివాస్, సిపిఐ నాయకులు సర్పంచ్ గుగులోతు నగేష్, జహీర్, రవి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :