సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : అర్హులందరికీ తక్షణమే పట్టాల పంపిణీ పూర్తి చేయాలి... సిపిఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం పట్టణంలో జీవో నెంబర్ 76 ద్వారా పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ తక్షణమే పట్టాలు అందజేయాలని, సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వై. శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న పట్టాల ఎంక్వైరీలో ఎన్ఓసి ఇవ్వాలని, అఫిడవిట్ సమర్పించాలని, అట్లాగే ఇంటి స్థలాల విక్రయదారుల సంతకాలు వాంగ్మూలం ఇవ్వాలని, వారసత్వ వాటా ఆస్తి అయితే కుటుంబ సభ్యుల ధ్రువీకరణ కావాలని తదితర ఆంక్షలు అధికారులు విధించడం సరికాదని శ్రీనివాస్ రెడ్డి వివరించారు. క్రమబద్ధీకరణ పట్టాల విషయంలో దరఖాస్తు దారుల ఆందోళన, ఇబ్బందులు, అధికారులు విధించిన నిబంధనలను స్థానిక కొత్తగూడెం తాసిల్దార్ పుల్లయ్య గారిని కలిసి సిపిఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ నాయకులు వినతి పత్రం అందించి సమస్యలను వివరించారు. స్థలాలు అమ్మిన వారి సంతకాలు కావాలని నిబంధన పెడితే డబ్బులు డిమాండ్ చేస్తారని, ఘర్షణలు జరుగుతాయని వివరించారు. గతంలో ఇటువంటి నిబంధనలు లేవని చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ పుల్లయ్య గారు మాట్లాడుతూ స్థలాల విక్రయదారుల సంతకాలు వాంగ్మూలాలు... నిబంధనలను తొలగిస్తామని, అర్హులందరికీ త్వరలోనే పట్టాలు పంపిణీ చేపట్టి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్ జిల్లా అధ్యక్షులు బోయిన విజయకుమార్ 18 వ వార్డు కౌన్సిలర్ పి సత్యనారాయణ చారి 11వ వార్డు కౌన్సిలర్ టిజిఎస్ జిల్లా అధ్యక్షులు భూక్య శ్రీనివాస్, సిపిఐ నాయకులు సర్పంచ్ గుగులోతు నగేష్, జహీర్, రవి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin