Wednesday, 29 July 2026 04:46:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రత్యేక నిధులతో చేపట్టిన పనులు వేగవంతం చేయాలి... -కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా

Date : 31 August 2023 03:23 AM Views : 377

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ప్రత్యేక నిధులతో చేపట్టిన పనులు వేగవంతం చేయాలని ప్రత్యేక నిధులతో చేపట్టిన పనులు వేగవంతం చేయాలనిజిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో డిఎంఎఫ్టి, ఎస్డీఎఫ్, ఎస్సీఏ, సిడిపి, సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులపై ఇంజినీరింగ్ అధికారులు, కంపెనీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పనుల పురోగతిని ఆయా శాఖల ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకనూ ప్రారంభించని పనులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అదనపు సిబ్బందిని ఏర్పాటుతో వేగవంతం చేయాలని చెప్పారు. నిధులు మంజూరు చేసినా ఎందుకు జాప్యం జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా ఇంజినీరింగ్ శాఖల అధికారులు పనులు ఎప్పటివరకు పూర్తి చేస్తారో షెడ్యూల్ ఇవ్వాలని, ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయాలని చెప్పారు. మంజూరైన పనులకు వారం రోజుళ్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ప్రగతిలో ఉన్న పనులు పూర్తి చేయడం, ప్రారంభించని పనులకు టెండర్ ప్రక్రియ నిర్వహించాలని, పూర్తి అయిన పనులకు ఆయా నియోజకవర్గ శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చి ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిర్మాణంలో ఉన్న అంగన్ వాడి భవనాలను పనులు పర్యవేక్షణ చేస్తున్న ఇంజినీరింగ్ అధికారులు, ఆయా శాఖల అధికారులు సంయుక్త తనిఖీ చేసి నివేదికలు అందచేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఐటిడిఎ పిఓ ప్రతీక్ జైన్, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, సిపిఓ శ్రీనివాసరావు, ఇంజినీరింగ్ అధికారులు, కంపెనీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :