సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : రాబోయే 24 గంటలలో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డా.వినీత్.జి మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు,వాగులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు సెల్ఫీల కోసం ఎవ్వరూ వెళ్ళకకూడదని తెలిపారు. చెట్ల క్రింద, శిదిలావస్థలో ఉన్న భవనాల క్రింద ఉండరాదని, కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ముట్టుకోరాదని సూచించారు. వరద నీరు ప్రవహించేటప్పుడు రోడ్లు దాటే ప్రయత్నం చేయకూడదని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని కోరారు. ఒకవేళ అత్యవసర ప్రయాణాలు చేయవలసిన పరిమిత వేగంతో జాగ్రత్తలు పాటించాలన్నారు. వర్షాల కారణంగా ఆపద తలెత్తితే వెంటనే 100కు డయల్ చేసి పోలీస్ వారి సహాయాన్ని పొందగలరని కోరారు. అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని ఈ సందర్బంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
-----------------------
Admin