సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు ఈనెల హైదరాబాదులో జరగబోయే ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సదస్సుకు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఏబిసిడి వర్గీకరణ కొరకు నిరంతరం పోరాడతానని మేడి పాపయ్య మాదిగ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పేడిదల రవి అధ్యక్షతన హుజూర్నగర్ టౌన్ హాల్లో జరిగిన హుజూర్నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో రవి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీ ఈనెల 20వ తారీఖున కోదాడ నియోజకవర్గం నుంచి ప్రారంభం కానుంది కాబట్టి నియోజకవర్గం ఇన్చార్జిలు మండల మండల అధ్యక్షులు గ్రామ గ్రామ కమిటీ అధ్యక్షులు ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రావూరి విజయభాస్కర్ మాదిగ,రాష్ట్ర ఉపాధ్యక్షులు కనుకు జానయ్య మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి కంటి అంబేద్కర్ మాదిగ, రాష్ట్ర సహాయ కార్యదర్శి పిడమర్తి నారాయణ మాదిగ,సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేళ్లచెరువు ముక్కంటి మాదిగ,జిల్లా ఉపాధ్యక్షులు వెంకటయ్య మాదిగ,హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి పెద్దపంగా కాటమయ్య మాదిగ, హుజూర్నగర్ టౌన్ అధ్యక్షులు రేడపంగు రాము మాదిగ,జిల్లా సహాయ కార్యదర్శి కస్తాల సైదులు మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు కష్టాల రవీందర్ మాదిగ జిల్లా నాయకులు ఎంపంగు గురుస్వామి మాదిగ నేరేడు చర్ల మండలం అధ్యక్షుడు మరియు టౌన్ అధ్యక్షులు ఇంజమూరి శ్రీకాంత్ మాదిగ చిలుక బాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin