సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : తలుపుల మండలం, కుర్లి గ్రామ సచివాలయం పరిధిలోని బట్రేపల్లి, మూలపల్లి మరియు మామిళ్లవారిపల్లి, నందు కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి.వి సిద్దారెడ్డి మరియు కదిరి నియోజకవర్గ వైసీపీ మాజీ సమన్వయకర్త ఎస్ఎండి ఇస్మాయిల్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలతో ఆరా తీశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకొని అక్కడే గల ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరిస్తూ ముందుకు సాగారు. గ్రామ సమస్యలను తెలుసుకుని అధికారులతో మాట్లాడి పరిష్కరించదగ్గ వాటిని అక్కడికక్కడే పరిష్కరించి పరిష్కారం కానటువంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మహమ్మద్ రఫీ నాయక్, సర్పంచ్ లు వెంకటనారాయణ, కుర్లి శివారెడ్డి మున్సిపల్ చైర్మన్ పరిగి నజీమున్నీసా సాధిక్, ఎంపీడీవో రాము నాయక్, సర్పంచులు షెక్షావలి, దివాన్ వలి, పెద్ది నాయుడు, వెంకటపతి నాయుడు, ఆడ్ శ్రీనివాసులు నాయక్, సుదర్శన్ రెడ్డి, రమణ, ఎంపీటీసీ లు రఘురాం, లోకనాథ్ రెడ్డి, ఆర్బికే చైర్మన్ చెన్న కృష్ణారెడ్డి, వైస్ సర్పంచ్ డీకే బాబు, మాజీ సింగల్ విండో అధ్యక్షులు గిరిధర్ రెడ్డి, మాజీ సర్పంచులు పురుషోత్తం రెడ్డి, ఫయాజ్ అహ్మద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, టెంపుల్ చైర్మన్ గోపాలకృష్ణ, మాజీ ఎంపీపీ రామిరెడ్డి, విశ్వనాథ్, రాజు, ప్రసాద్, బాలకృష్ణ, శంకర్ రెడ్డి, అల్తాఫ్, షాను, ఓబుల్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, మహేష్, రమణారెడ్డి, మోహన్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డి, చిన్న రమణయ్య, రామ్మోహన్ రెడ్డి, రమేష్, అన్వర్, ఆవుల సుధాకర్ రెడ్డి, పణిశేఖర్ రెడ్డి, ఎర్రమారెడ్డి, అక్కుల్ రెడీ, మౌలా, రాజు, ప్రభు, మౌలా, గోపాల్ రెడ్డి, వలి, పీరా సాబ్, మండల అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, తదితర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
-----------------------
Admin