Thursday, 30 July 2026 08:04:09 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బాబయ్య దర్గా అభివృద్ధికి సమగ్ర చర్యలు...

Date : 23 October 2022 12:29 AM Views : 382

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుగొండ పట్టణంలో బాబయ్య దర్గా చేపట్టాల్సిన పనుల గురించి అధికారులతో తొందరగా పని చేపట్టాలి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో పెనుగొండ బాబయ్య దర్గా కూడా ప్రధానమైనది అని పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ అన్నారు. ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయణ మత సామరస్యానికి ప్రతీకగా దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి గాంచిన పెనుకొండ బాబయ్య దర్గాకు సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. దర్గా అభివృద్ధికి ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసిన నేపధ్యంలో చేపట్టాల్సిన పనుల గురించి వక్స్ బోర్డు అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, దర్గా పీఠాధిపతి తాజాబాబా తో కలసి శుక్రవారం రాత్రి వరకు చేపట్టాల్సిన పనుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా దర్గా లోపల భాగంలో టైల్స్ ఏర్పాటు, పాలిష్ బండలు వేయుట, భక్తుల భోజనాల కోసం ప్రత్యేక వసతి గృహం ఏర్పాటు, దర్గా లోపలి భాగంలో దుర్గంధానికి తావు లేకుండా డ్రైవ్ నిర్మాణం, భక్తుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించుట, ప్రత్యేక బాత్ రూంల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు, అండర్ గ్రౌండ్ లైటింగ్, వాహనాల పార్కింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేయడం, కాంపౌండ్ నిర్మాణం. భక్తులు వేచి వుండడానికి ప్రత్యేక షెడ్ల నిర్మాణం వంటి విషయాలపై ఎమ్మెల్యే సుధీర్ఘంగా చర్చించారు. దక్షిణ భారత దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన దర్గాగా తీర్చుదిద్దుదామని ఆయన పేర్కొన్నారు. పలు విషయాలపై తగిన సూచనలు. సలహాలు అందించారు. అనంతరం దర్గాకు ప్రధాన రోడ్డు విస్తరణ పనులు గురించి సమీక్షంచి, వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముస్లీంలు భారీగా పాల్గొన్నారు, మత పెద్దలు, పెనుకొండ వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నాగలూరుబాబు, టౌన్ కన్వీనర్ బోయనరసింహ, నగర పంచాయితీ చేర్మన్ ఉమర్ ఫరూక్ ఖాన్, వైస్ చైర్మన్ సునీల్, కౌన్సిలర్లు, నగర పంచాయితీ కమిషనర్ వంశీకృష్ణ బార్గవ్, ఎంపీపీ గీత, జడ్పీటీసీ శ్రీరాములు, ముఖ్యనాయకులు మాజీ ఎంపీటీసి రామ్మోహన్రెడ్డి, జయశంకరరెడ్డి, ఫరీద్, బోయబాబు, శ్రీరాములు, నేమతుల్లా. సికృతుల్లా, చండానాయక్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :