సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం :సమీకృత జిల్లా అధికారుల సముదాయపు భవనం (నూతన కలెక్టరేట్ ఐడిఓసి)అధికారుల కార్యాలయాలు అన్ని ఉన్న ఒకే ప్రాంగణ ప్రాంతంలో ధర్నాచౌక్ ను ఏర్పాటు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని,ప్రజా సమస్యల పరిష్కారాల పై ధర్నాచౌక్ సందేశం అధికారులకు తెలుస్తుందని,ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడానికి ధర్నాచౌక్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ధర్నాచౌక్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందని కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ధర్నా చౌక్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో నాగుల రవికుమార్,మాలోత్ వీరు నాయక్, చెనిగారపు నిరంజన్ కుమార్,చుంచుపల్లి మండల అధ్యక్షుడు ఆట శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin