సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : హుజుర్ నగర్ పట్టణంలో పార్ బాయిల్డ్ రైస్ మిల్ల్ డ్రైవర్స్ యూనియన్ (ఐ ఎన్ టి యూ సి అనుబంధం) అధ్యక్షులు సలిగంటి జానయ్య అద్వర్యంలో గేట్ మీటింగ్ మిల్లుల ఆవరణం లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఐ ఎన్ టి యూ సి నియోజకవర్గ అధ్యక్షులు బెల్లంకొండ గురవయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 16న ఆల్ ట్రేడ్ యూనియన్ జాతీయ నాయకుల పిలుపు మేరకు అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులందరు కూడా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్ లో పాల్గోని విజయవంతం చేయాలని ఐ ఎన్ టి యూ సి పిలుపునిచ్చిందని అన్నారు. సమ్మె నోటీసు అందుకున్న యాజమాన్యాలు బందుకి సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్లకు కొమ్ము కాస్తు కార్మిక వర్గాన్ని అణిచివేసేందుకు కుట్రలు చేస్తుందని అని అన్నారు. కార్మిక చట్టాలను సవరణ చెయ్యాలని చూస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కార్మికులు తమ శక్తిని చూపిస్తారు అని మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో ఐ ఎన్ టి యూ సి జిల్లా నాయకులు చింతకాయల రాము. యూనియన్ జనరల్ సెక్రటరీ మేకపోతుల వీరబాబు. కాకిలేటి సుబ్బారావు. ఇంటి తిరుపయ్య. గడ్డం నాగరాజు.శీలం రాజు.చల్ల శ్రీను. బోడ్డు వీరయ్య.గుండెబోయిన శ్రీను.అమరబోయిన ప్రసాద్.చడపంగు కనకయ్య. ఆకం రామారావు. తురక రమేష్.గుంజ లక్ష్మి నారాయణ.తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin