Wednesday, 29 July 2026 01:25:32 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీఎస్పీ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ వేతనం రూ.30వేలు చెల్లిస్తాం...

Date : 30 September 2023 07:38 AM Views : 235

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం, కలెక్టరేట్ : అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, అంగన్వాడీలకు 26 వేలు వేతనం చెల్లించాలని, అంగన్ వాడీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరిగా ఉండటం సరికాదని,వారి న్యాయమైన సమస్యలు తక్షణమే పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.19వ రోజుకు చేరుకున్న అంగన్ వాడీల నిరవధిక సమ్మెకు బస్టాండ్ చిల్డర్స్ పార్క్ వద్ద,కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద సమ్మె చేస్తున్న అంగన్ వాడీ ఉద్యోగులకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ అంగన్ వాడీలచే ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటుందని,కనీస వేతనం అందక అంగన్ వాడీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,అంగన్ వాడీలను వెంటనే పర్మినెంట్ చేయాలని,కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని,పెన్షన్,ఈఎస్ఐ సదుపాయం,ఉద్యోగ భద్రత కల్పించాలని,రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద టీచర్లకు పది లక్షలు,ఆయాలకు 5లక్షలు ఇవ్వాలని,సుప్రీంకోర్ట్ తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం అంగన్ వాడీ ఉద్యోగుల పట్ల కక్షసాధింపు ధోరణి ప్రదర్శించుకుండా వెంటనే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి..బీఎస్పీకి పట్టం కట్టాలని బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్ వాడీలను పర్మినెంట్ చేసి,రూ.30వేల వేతనం అందిస్తామని రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.యస్.ప్రవీణ్ కుమార్ ప్రకటించారని తెలిపారు ఈకార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి చెనిగారపు నిరంజన్ కుమార్,అసెంబ్లీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు నాగుల రవికుమార్,అల్లకొండ శరత్,కార్మిక విభాగం జిల్లా కార్యదర్శి గోపి,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :