సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి రాజీవ్ గాంధీ అమర్ రహే అమర్ రహే అంటూ నినదించారు. భారతదేశంలో అనేక గొప్ప సంస్కరణలు సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ స్పేస్ అండ్ రీసెర్చ్ రంగాల అభివృద్ధికి ఆధునిక భారతావనికి పునాదులు వేసి అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపి ఆఖరి క్షణం వరకు భారతదేశ అభివృద్ధి కోసం పరితపించిన మహానేత రాజీవ్ గాంధీ అని ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నియోజకవర్గ ప్రెసిడెంట్ షేక్ సైదా మరియు గౌడ సొసైటీ ప్రెసిడెంట్ వల్లపు దాసు కృష్ణ గౌడ్ డిసిసి మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జక్కుల మల్లయ్య కోలపుడి యోహాన్ లచ్చమల్ల నాగేశ్వరరావు ఇట్టిమల్ల బెంజిమెన్ ముషం సత్యనారాయణ చప్పిడి సావిత్రి కౌన్సిలర్లు తేజావత్ రాజా కారింగుల వెంకటేశ్వర్లు ఎడ్ల విజయ్ జక్కుల శంబయ్య నర్సింగ్ వెంకటేశ్వర్లు పున్నయ్య చలి కంటి జానయ్య, అమర్నాథ్ రెడ్డి, బి సైదులు, వెంకటేశ్వర్లు, కంకణాల పుల్లయ్య, రామిరెడ్డి, బెల్లంకొండ శ్రీనివాస్, మహిపాల్, సలీం, రాము, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin