సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ / విద్యార్థుల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు శీలం వెంకీ ఆధ్వర్యంలో హుజూర్నగర్ పట్టణంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలను సందర్శించి అన్ని పాఠశాల యజమానులను కలిసి వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వినతి పత్రంలో అన్ని పాఠశాలలోనియమ నిబంధనలు ప్రకారం నడుపుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం విద్యార్థులకు ఉచిత విద్య ,క్వాలిఫైడ్ టీచర్ల నియామకం,విద్యార్థిని విద్యార్థులకు బాత్రూములు,బస్సుల ఫిట్నెస్ గురించి మరియు,స్కూల్ ఆటస్థలం ఉందా వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధ్యక్షుడు శీలం వెంకీ మాట్లాడుతూ వేల వేల ఫీజులు తీసుకొని కనీస విద్యా అర్హత లేని టీచర్ల తో బోధిస్తున్నారని వారి స్థానంలో విద్య ఆరాధన కలిగిన వారిని నియమించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు, కంట్టు నాగరాజు, గొల్ల గోపు సతీష్, గోనెల్ల రామకృష్ణ, చిలక రాజు కార్తీక్, తాళ్ల ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin