సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గంలో ఫరూఖ్ నగర్ మండలం చౌలపల్లి గ్రామంలో పిడుగు పడి గ్రామానికి చెందిన పీర్లగూడెం బుడ్డయ్య అనే రైతు కు చెందిన రెండు గెదలు మృతి చెందాయి. రెక్కాడితే గాని డొక్కాడని పేద రైతు తన జీవనదారం అయినా గెదలు మృతి చెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు న్యాయం చేయాలనీ కోరారు. చనిపోయిన గేదెలను చూడడానికి వచ్చిన చౌలపల్లి సర్పంచ్ రుక్సానా బేగం మాట్లాడుతూ... బుడ్డయ్య పేద రైతు అని పిడుగు పడి అతని బర్రెలు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై వాటర్నిటీ డాక్టర్ తో మాట్లాడడం జరిగిందని వారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి కలెక్టర్ కు నివేదిక పంపుతామని అన్నారని ఎలాగైనా రైతు బుడ్డయ్య కు న్యాయం చేస్తామని అన్నారు.
-----------------------
Admin