సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : క్రిస్మస్ సందర్భంగా పాలకవీడు మండల క్రైస్తవ సోదరులకు ఎంపీపీ భూక్యా గోపాల్ నాయక్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.మీగడం పహాడ్ తండ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలలో పాల్గొని మాట్లాడుతూదైవ కుమారుడు జీసస్ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్గాజరుపుకుంటున్నామని,క్రిస్మస్ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక ప్రక్రియ అన్నారు.దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం–త్యాగాలకు జీసస్ తన జీవితం ద్వారా బాటలు వేశారని క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాస్టర్లు మూడు బిక్షం, రూపవత్ బాలు సంఘపెద్దలు వీరన్న,సైదు ,సైథా,నాగు,శివ,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin