Wednesday, 29 July 2026 05:36:48 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి... -ఆరోగ్య వైద్యాధికారి  ఐనొద్దిన్

Date : 16 May 2023 11:26 PM Views : 565

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువులో జాతీయ డెంగ్యూ దినోత్సవంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య వైద్యాధికారి  ఐ నొద్దిన్ పేర్కొన్నారు. స్థానిక ఆరోగ్య వైద్యశాల నుండి  వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ర్యాలీగా వెళ్తూ దోమలు పుట్టరాదు దోమలు కుట్టరాదు అని నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ కుడిలి వెళ్లి అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు వారు మాట్లాడుతూ అపరిశుభ్రత నివారణే డెంగ్యూ నివారణకు మార్గమని ప్రతి శుక్రవారం మాత్రమే కాకుండా ప్రతిరోజు డ్రైడే పాటించాలని తద్వారా దోమలు పుట్టకుండా చేసినట్లయితే డెంగ్యూ వ్యాధిని నివారించ వచ్చని తెలియ జేసినారు . దోమ పుట్టకూడదు దోమ కొట్టకూడదు అంటూ నినాదాలు చేశారు. పగటిపూట కుట్టే దోమల వల్లనే డెంగ్యూ జ్వరాలు వస్తాయని ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.రానున్న వర్షాకాలంలో జిల్లా ప్రజలంతా పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దోమలు పుట్టకుండా చేయవచ్చునని దోమల వచ్చే వ్యాధులైన మలేరియా ,డెంగ్యూ ,చికున్గున్యా , ఫైలేరియా మరియు మెదడువాపు లాంటి వ్యాధులు రాకుండా చేయవచ్చని తెలియజేసారు .కావున ప్రజలందరూ దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.తప్పని సరిగా డ్రైడే పాటించాలని ,పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని యిండ్లలోని కూలర్లలోని నీటిని ఎప్పటి కప్పుడు మార్చుకోవాలని కోరారు .కొబ్బరి బొండాలు ,పూలకుండీలు ,టైర్లు రోళ్ళు ,పాడుబడిన ప్లాస్టిక్ సామానులలో నీరు నిల్వ లేకుండా చూడాలని ఈ విషయాలపై ప్రజలలో అవగాహన కల్పించాలని కోరారు . ఈ కార్యక్రమంలో ఎంపీ హెచ్ ఈ ఓ లాలు నాయక్, సిహెచ్ఓ సుభాషిణి, సూపర్ వేజర్ మురళి, మద్దిలేటి మనోహర్, ఏఎన్ఎం లు, ఆశ, కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :