సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా హుజూర్ నగర్ కొత్త బస్టాండ్ నుంచి హుజూర్ నగర్ తాసిల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అలాగే హుజూర్ నగర్ తాసిల్దార్ ఆఫీస్ లో జాతీయ ఓటర్ల దినోత్సవం పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హుజూర్ నగర్ కోర్ట్ సీనియర్ సివిల్ జడ్జి శ్యాం కుమార్ పాల్గొని సందేశాన్ని ఇచ్చారు. జడ్జి మాట్లాడుతూ 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పడిన రోజుకు గుర్తుగా ఈ యొక్క ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నామని, యువత 18 ఏళ్లు నిండగానే ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, అట్లాగే కులం మతం భాష వర్గం చూడకుండా కేవలం అభివృద్ధి ఎవరైతే చేస్తారో వారికే ఓటు వేసినప్పుడు ప్రజాస్వామ్యం మనగలుగుతుందని తెలిపారు. అట్లాగే ఎవరూ కూడా రెండు చోట్ల ఓటును కలిగి ఉండరాదని అట్లా రెండు చోట్ల ఓటు కలిగి ఉండడం ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం నేరం అవుతుందని తెలిపారు. ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని తెలిపారు. ఓటర్ దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, తాసిల్దారు నాగార్జున రెడ్డి, ఏజీపీ గోపాలకృష్ణ, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ సభ్యుడు వెంకటేశ్వర్లు అలాగే జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ , కాలేజీ విద్యార్థులు ఇతరులు పాల్గొన్నారు..
-----------------------
Admin