సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లను బేషరతుగా రెగ్యులర్ చేయాలని కోరుతూ, మక్తల్ తహసిల్దార్ సువర్ణ రాజ్ మరియు వైద్యాధికారి తిరుపతయ్య లకు సెకండ్ ఏఎన్ఎం లు వినతి పత్రం అందజేశారు. గత నెలలో సమ్మె సందర్భంగా తమ డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నట్లు వారు తెలిపారు. వినతి పత్రం అందించిన వారిలో ఏఎన్ఎంలు వెంకటేశ్వరి, చంద్రకళ, శివలీల, లలిత, శశికళ ,మునెమ్మ , అనసూయ, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin