సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నియమావళిని జిల్లా యంత్రాంగం పటిష్టంగా అమలు చేయడం జరుగుతుంది, సోషల్ మీడియా సైట్ల పై ప్రత్యేక నిఘా ఉంచాం, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పౌరులు బాధ్యతగా నడుచుకోవాలి జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, పోలీసు శాఖ అధ్వర్యంలో సోషల్ మీడియా మానిటరింగ్ సెంటర్ లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాము అని అన్నారు. ఎవరైనా ఇతర వ్యక్తులను, రాజకీయ పార్టీలను ఉద్దేశించి సోషల్ మీడియా సైస్ట్ వాట్సప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, x ట్విట్టర్ మొదలగు వాటిలో అనుచితమైన వాక్యాలు, అనుచిత పోస్టింగ్ లు పెడితే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ డివైజ్ లు సీజ్ చేస్తామని అన్నారు.
-----------------------
Admin