సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల : మండలం దిర్శించర్ల గ్రామంలోనీ జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన్ చందు జయంతిని పురస్కరించుకొని క్రీడా దినోత్సవం సందర్బంగా ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు ఆదేశాల మేరకు ఆటలు ఆడడానికి అనువుగా పిల్లలకు క్రీడ దుస్తులను ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న అందజేశారు. ఈ సందర్భంగా ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న మాట్లాడుతూ ఓజో ఫౌండేషన్ ద్వారా నేరేడుచర్ల లోనే కాకుండా అనేక మండలాల్లో క్రీడాకారులను ప్రోత్సహించిన వ్యక్తి పిల్లుట్ల రఘు మాత్రమే అన్నారు యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాలీబాల్, క్రికెట్ కిట్లతో పాటు అనేక మంది స్కూలు పిల్లలకు క్రీడ దుస్తులను తమ ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేయడం చేశారు .అని అన్నారు. పిల్లుట్ల రఘు చేస్తున్న సేవలు నియోజకవర్గం లో నిర్విరామంగా కోనసాగుతున్నాయి. కులాల కి అతీతంగా మతాలకు అతీతంగా రఘు చేస్తున్న సేవలను చూసి నియోజకవర్గంలో పిలుట్ల రఘు లాంటి మానవతా భావలున్నా నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలును ఆర్థికంగా ఆదుకోవడంలో గాని, విద్య వైద్యంలో గాని ఓజో పౌండేషన్ తరపున పిల్లుట్ల రఘు చేస్తున్న సేవలు నియోజవర్గ ప్రజలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయని రాబోయే కాలంలో పిల్లుట్ల రఘు ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించు కొని నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతామని తాము అధికారంలోకి వచ్చాక ఇంకింత రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశాడు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మధు,ఫౌండేషన్ ప్రతినిధులు షేక్. నాగుల్ మీరా, షేక్ జాన్ సైదా, నాగరాజు యాదవ్, తమ్మిశెట్టి రాజేష్, వానపట్ల నాగరాజు, బొమ్మకంటి సైదులు, మహేష్,ఓజో ఫౌండేషన్ సభ్యులు,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin