సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం మందపెల్లి గ్రామానికి చెందిన మారేడుగొండ శ్రీమాలత రాజేశ్వరచార్యులు,వరికేల కమలాకర్ రగుసల నేతాజే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మందపెల్లి సర్పంచ్ అభ్యర్థి లింగాల సుమలతకి సకరించకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధంతాలను విస్మరించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పడుతున్న కారణంగా మూడు కుటుంబాల వారిని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ వారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు నుంచి వారికి కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని,ఎవరైనా భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు గాని కార్యక్రమాలు కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఇదే తరహాలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
-----------------------
Reporter