సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పరిసరాల పారిశుద్ధ్యన్ని పాటించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో పబ్లిక్ క్లబ్ వెనక డెంగ్యూ కేసు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి డ్రైడే మరియు దోమ లార్వా నిర్మూలనకు డై ఫ్లూ బెంజిరన్ స్ప్రే చేయించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాల పారిశుధ్యం ద్వారా ప్రజలు మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు.ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వలు ఉన్న ఎడల దోమల వ్యాప్తి జరిగి మలేరియా, డెంగ్యూ , బోదకాలు, మెదడు వాపు వంటి వ్యాధులువ్యాపిస్తాయనీ ఇంటి చుట్టు పక్కల కుండలు, టైర్లు ,జాడీలు డిస్పోజల్ గ్లాస్ లేకుండా చూడాలని వారానికి ఒకరోజు డ్రై డే పాటించి నీటి తొట్లు, డ్రమ్ములు , ఓవర్హెడ్ ట్యాంకులను కడిగి ఆరబెట్టాలనీ సూచించారు. .ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఏ ఎన్ ఎం లలిత ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin