సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ విజయమని, సీఎం కేసీఆర్ మెడలు వంచి రైతుల రుణమాఫీ సాధించామని అదే విధంగా రైతు రుణమాఫీ వడ్డీలతో సహా మొత్తం చెల్లించాలి అంటూ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణ ఆరో వార్డులో వీర్లపల్లి శంకర్ బస్తిబాట కార్యక్రమాన్ని గురువారం ఉదయం నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే. చెన్నయ్య ఆధ్వర్యంలో స్థానిక నాయకులు కలిసి ఆరో వార్డులో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు, పోరాటాలు, ఒత్తిడి ఫలితంగానే నేడు సీఎం కేసీఆర్ రుణమాఫీ ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర చీఫ్ సెక్రటరీని కలిసి రుణ మాఫీ గురించి డిమాండ్ చేసిందనీ, రుణమాఫీ అమలు చేయకపోతే బ్యాంక్ల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించాం అని గుర్తు చేశారు. కేసీఆర్ మెడలు వంచి రైతుల రుణమాఫీ సాధించాం అన్నారు. కేసీఆర్ అసమర్థత వల్ల రుణమాఫీ నాలుగు సంవత్సరాలు ఆలస్యం అయ్యింది. రైతు రుణమాఫీ వడ్డీలతో సహా మొత్తం చెల్లించాలి. రైతులకు పూర్తి స్థాయిలో రుణ మాఫీ అందేవరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తుంది. అని శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, చెంది తిరుపతి రెడ్డి, కే. చెన్నయ్య, నల్లమోని శ్రీధర్, ముబారక్ అలీ ఖాన్, రాజు, తుపాకుల శేఖర్, షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin