సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం శ్రీనివాస పురం గ్రామ రెవెన్యూలో వేములూరి వాగులో ఈరోజు ఉదయం 08.00 గంటలప్పుడు ఒక గుర్తుతెలియని మగ మనిషి మృతదేహం చేపల వేటకు వెళ్లిన గంటసాల రామాంజనేయులు, ఊరుకొండ పెద్ద వెంకన్న లకు కనిపించగా అట్టి విషయం గ్రామ సర్పంచ్ సైదేశ్వరరావు కి తెలుప గా వెంటనే హుజూర్ నగర్ పోలీసు అధికారులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమితం హుజూర్ నగర్ ప్రభుత్వ హాస్పటల్ కు తరగించారు.మృతుని వయస్సు అందజ 40 సం'లు , ఎత్తు 5 ఫీట్లు ఉంటుంది. మృతుడు చూడటానికి బెగ్గర్ ల కనిపిస్తున్నాడు. ఎవరైనా మృతుని వివరములు తెలిచిన యెడల తెలుపగలరని హుజూర్ నగర్ ఎస్ ఐ తెలిపారు....
-----------------------
Admin