సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొట్టే నాగరాజు యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సొంతఇల్లు లేని అర్హులైన ప్రైవేట్ టీచర్లకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నుంచి గతంలో పౌర సరఫరాల మరియు నీటిపారుదల శాఖ మంత్రి కుమార్ రెడ్డి ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ హుజూర్ నగర్ ఆర్డిఓ, ఎమ్మార్వో,,మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి లను కలిసి ఇందిరమ్మ ఇళ్లను సొంతఇల్లు లేని అర్హులైన ప్రైవేట్ టీచర్లకు కేటాయించాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని వారు కూడా సానుకూలంగా స్పందించారాని అన్నారు. విద్యార్థులను బావి భవిత పౌరులుగా తీర్చిదిద్దే ప్రైవేటు ఉపాధ్యాయులు చాలీచాలని జీతాలతో ఇల్లు లేక అద్దె ఇళ్లలో జీవితం కొనసాగిస్తూ అద్దె కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారని సొంతఇల్లు లేని అర్హులైన ప్రైవేట్ టీచర్లకు ఇందిరమ్మ కమిటీలలో ఉన్న మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్ లు, స్పెషల్ అదికారులు కమిటీ సభ్యులను అర్హులైన ప్రైవేట్ టీచర్లకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూడాలని కోరారు....
-----------------------
Admin