సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో జిల్లాస్థాయి స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ పాఠశాల క్రీడా పోటీల ఎంపిక నిర్వహించారు... ఈ క్రీడా పోటీల నిర్వహణ బాలికల పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు దానమయ్య, మాస్టర్ షాకిర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా,శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని స్క్వాయ్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ క్రీడా పోటీలలో ఖావంకీ, లోబో ఈ రెండు విభాగాలలో పాల్గొని వారి ప్రతిభను కనపరిచారు. కదిరి పట్టణం లో బాలికల పాఠశాల ఆవరణంలో జరిగిన జిల్లా స్థాయి క్రీడా పోటీలో పలు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు వీరు డిసెంబర్ 17,18 తేదీలలో నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియం లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి స్కూల్ గేమ్ కార్యదర్శి రవి,జిల్లా ఏపీ పిడి అస్సోసియేషన్ అనంతపురం,శ్రీ సత్యసాయి జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు బయరెడ్డి,నరసింహ రెడ్డి,లష్కర్ నాయక్, రాజా శేఖర్,బాబా,లక్ష్మీ నారాయణ,కేశవ మూర్తి,గోపాల్ రెడ్డి,రాజశేఖర్,ప్రసాద్,ఆదినారాయణ,శివ,రాష్ట్ర స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ చైర్మన్ ఇస్మాయిల్,రెఫరీలు ఖాదర్,చాందిని,అనంతపురం జిల్లా కోచ్ మురళి కృష్ణ రెడ్డి,వ్యాయమ ఉపాధ్యాయురాలు మంజు భార్గవి లు పాల్గొన్నారు గాండ్లపెంట కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న మద్దిమడుగు తేజశ్రీ, విజయవాడ నలంద అనంతపూర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రంజిత్, మనోజ్ఞ సాయి జాయిన్ఇంగ్లీష్ మీడియం పాఠశాల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైంది.,పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin