సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని పలు బేకరీలలో కెమికల్ కలిపి తయారుచేసిన బెడ్ ప్యాకెట్లను వాసన వస్తున్న వాటిని అమ్ముతున్నా పట్టించుకోని అధికారులు... ఇప్పటికే గ్రామాలలో మలేరియా డెంగ్యూ విష జ్వరాలతో బాధపడుతున్న రోగులకు వైద్యలు ఇచ్చే సలహా బ్రెడ్ పండ్లు తినమని చెప్తారు కదా ఇదే అదునుగా తీసుకొని బేకరీ యజమాన్యులు సామాన్యుల ప్రాణాలపై చెలగాటమాడుతున్నారు సర్వసాధారణంగా జ్వరం వచ్చిన ప్రతి పేషెంట్ పాలల్లో బ్రెడ్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు ఈ బ్రెడ్ లో ఏదో కెమికల్ వాసన వస్తుంది అని చాలామంది కొనుగోలు చేసిన కస్టమర్లు చాలాసార్లు బ్రెడ్ బాగోలేదని వాపసిచ్చామని కస్టమర్ తెలిపారు ఈ బ్రెడ్ తిన్నవాళ్లు వాంతులు విరోచనాలు అయ్యి చాలామంది హాస్పిటల్ పాలు అయ్యారని సమాచారం బ్రెడ్ లోపల ప్లాస్టిక్ పేపర్స్ దర్శనం... ఇదేమిటని ప్రశ్నిస్తే బేకరీ సిబ్బందిదురుసుగా ప్రవర్తన... గతంలో కేకు లపై ఈగలు దర్శనం ... పిల్లలు పెద్దలు తినే బ్రెడ్ లో ఇలా ప్లాస్టిక్ రావడానికి ప్రశ్నిస్తున్న వినియోగదారుడు... సాధారణంగా వస్తాయి అయితే ఏం చేయమంటావు అంటూ బేకరీ యజమానులు సమాధానం.... గతంలో ఎన్నడూ లేనటువంటి కంప్లైంట్ బేకరీలపై ఇప్పుడెందుకు వస్తుందని వినియోగదారులు చర్చించుకుంటున్నారు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న బేకరీ షాపు లో పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది... అయ్యా మేము ఏం పాపం చేశాము ఈ బ్రెడ్ తినేవాళ్ళు అంతా కూడా సామాన్యులు వ్యవసాయం చేసే రైతులు బేకరీ షాపులలో టెస్టింగ్ సాల్ట్ (చైనా) ఎక్కువగా వాడుతున్నారు, ఈ టెస్టింగ్ సాల్ట్ ని కూడా పూర్తిగా నిర్మోనించాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కూడా ఇదే పరిస్థితి సంబంధిత ఫుడ్ ఇన్స్పెక్టర్ లేదా ఇతర అధికారులు దృష్టి సారించి ఈ బేకరీల పై చర్యలు తీసుకోవాలని మా ప్రాణాలను కాపాడండి మాహప్రబో అని కొనుగోలుదారులువేడుకుంటున్నారు.
-----------------------
Admin