సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కాంగ్రెస్ బిజెపి మాయ మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేస్తే అభివృద్ధి మరింత జరుగుతుందని షాద్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. ఇన్ముల్ నర్వ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్. ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. సంక్షేమం మరింత కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. మూడవసారి మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ గెలుపొందిన నాటి నుండి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. దర్గా అభివృద్ధి 50కోట్లు, రూ.1.32కోట్లతో సి.సి రోడ్డు నిర్మాణం పనులు, అంతర్గత మురుగు కాలువలు, ఆసరా పింఛన్ ధ్వారా ప్రతి నెల 544 మందికి 12.21లక్షల రూపాయలు వస్తున్నాయి.. రైతు బంధు లబ్ధిదారులు 1518మంది, 10.25కోట్లు, రైతు రుణమాఫీ లబ్ధిదారులు 255 మంది, 2.04కోట్లు, రైతు భీమా లబ్ధిదారులు 14 మంది, 70లక్షలు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులు 112మంది, 1.03కోట్లు, స్మశానవాటిక నిర్మాణం కోసం 12.60లక్షలు. కొత్తూరు నుండి జెపి దర్గా డబుల్ రోడ్ 20 కోట్లు, షాద్ నగర్ నుండి జెపి దర్గా డబుల్ రోడ్ 16.49కోట్లు, దర్గా నుండి ఎక్లాస్ ఖాన్ పేట డబుల్ రోడ్ 6కోట్లు, దర్గా నుండి వేముల నర్వ వయా సంగెం డబుల్ రోడ్ 10కోట్లు, రూ.1.45కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా 2 ట్యాంకుల నిర్మాణంతో 1373 ఇండ్లకు త్రాగునీటి సరఫరా.. మిషన్ కాకతీయ ద్వారా 45లక్షలతో పీర్ల చెరువు, 6.50లక్షలతో తుమ్మల కుంటాల పూడికతీత.. డ్వాక్రా భవనం 15లక్షలు, అంబేద్కర్ భవనం 20లక్షలు, రైతు వేదిక 22లక్షలు, గిరిజన భవనం 20లక్షలు, గిరిజన బాలుర పాఠశాల ఏర్పాటు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కారుగుర్తు పార్టీకి అండగా ఉంటూ కారుగుర్తుకు ఓటు వేసి మరొక్కసారి ఆశీర్వదించాలి, అభివృద్ధిని కొనసాగిద్దామని ఈ సందర్భంగా ప్రజలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కోరారు.
-----------------------
Admin