సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూరు మండల కేంద్రంలోని జిరాత్ నగర్ లో గల విద్య హై స్కూల్ ఆవరణలో ఏర్పాటుచేసిన అవ్వకు బువ్వ రక్షా స్వచ్ఛంద సేవ సమస్త ఆధ్వర్యంలో 54 మంది నిరుపేద వృద్ధులకు అందజేయడం జరిగింది. ఇట్టి సందర్భంలో సమస్త వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాoదేష్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవర్ మాట్లాడుతూ అవ్వకు గువ్వా కార్యక్రమం ద్వారా పేద తమ వంతు సహకారం అందిస్తున్నామని మానవసేవే మాధవసేవ అని అన్నారు. త్వరలో సమస్త తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సమస్త ఉపాధ్యక్షులు జిందం నరహరి, విద్య గోపి పట్వారి, కార్యదర్శి డాక్టర్ బేతు గంగాధర్ ఖాoదేష్ సత్యం, తులసి దాస్ పట్వారి, మక్కలసాయినాథ్, మీరా శ్రావణ్, సభ్యులు శరత్ కోడె శ్రీనివాస్,రాజేష్, సంజీవ్, ప్రశాంత్ సాయి, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin