సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ పట్టణంలో సిపిఐ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సిపిఐ జెండా ఎగరడం జరిగింది పేద ప్రజలకు అండ సిపిఐ జెండా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ లో డిసెంబర్ 26వ తారీఖున జెండాను ఎగరవేయడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు పేద ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలపై ప్రజా పోరాటాలు నిర్వహించిన వారన్నారు కేంద్ర ప్రభుత్వం రైతులపై మూడు నల్ల చట్టాలను తీసుకుని వచ్చి రైతులను ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని వారన్నారు తాత్కాలికంగా ఉపసంహరించుకున్నటువంటి రైతు చట్టాలను పూర్తిస్థాయిలో ఉపసంహరి పసవరించుకోవాలని వారన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లో 4,500 మంది ప్రాణ త్యాగాలు చేసినారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 10 లక్షల ఎకరాలు పంచిన ఘన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉన్నదని వారన్నారు ఈ వంద సంవత్సరాల కాలంలో అనేక ఆటుపోట్లు తినుకుంటూ ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నివారన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు భాగముగా డిసెంబర్ 30వ తేదీన నల్లగొండ ఎన్జీ కాలేజీలో వేలాది మందితోని భారీ బహిరంగ సభ జరుగుతుందని వారన్నారు ఈ బహిరంగ సభకు భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యులు సానుభూతిపరులు కౌలు కళాకారులు మేధావులు అందరూ పాల్గొని ఈ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయాలని వారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ఎండి సయ్యద్ మండల సహాయ కార్యదర్శి అంజనపల్లి రామలింగం దళిత హక్కుల పోరాట సమితి నాయకులు వల్లంపట్ల వెంకన్న మండల సమితి నాయకులు ఎస్కే సేమియం ఎర్రబోతు పద్మ లింగంపల్లి ఎంకన్న ఎండి రహీం శైలజ కళావతి సులోచన జానీ అక్బర్ ఆదిల్ మజీద్ యూసుఫ్ ధోని తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin