సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల్ దేవర చెరువు మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల న్యాయసేవ అధికార సంస్థ నిర్వహించడం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామాలలో తగాదాలు పడకుండాసామరస్యంగా పరిష్కరించుకోవాలని లేకపోతే మన భవిష్య తరాలు ఇబ్బందులు పడవలసివస్తుందని తెలిపారు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి తీసుకోవాలని, న్యాయవాది సలహా తీసుకొని ముందుకుపోవలని తెలియజేసారు. ఆర్థిక స్తోమత లేనివారికి ఉచిత న్యాయాన్ని అందించడానికి న్యాయస్థానం ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటుచేస్తుందని తెలియజేసారు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు శివశంకర్, వీరనారాయన,asi కిషోర్ రెడ్డి, ప్రజలు పాల్గొన్నారు
-----------------------
Admin