సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం లోని పాల కీడు మండల పరిధిలో గల కల్మెట్ తండాలో గడప గడపకు రఘున్న 3వరోజు భరోసా యాత్ర లో బాగంగా చలిని సైతం లెక్క చేయకుండా వెకువజామనే పిల్లుట్ల రఘున్న కల్మెట్ తండాలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యలు, ఊరు సమస్యలు విని.. ఒక్క అవకాశం ఇవ్వండి, మీ బతుకులు మార్చుతా అని,మండల పరిధిలో ఎన్నో సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి అయినా మన యువతకి ఉద్యోగాలు రాకుండా, సొంత పనులపై ఆధారపడి రోజు వారి కూలీలుగా మార్చి పనులు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు మార్చటానికి వచ్చిన వ్యక్తిని నేను అని ఒక్క అవకాశం ఇవ్వండి ప్రతి తండాని అభివృధి చేస్తా అని పిల్లుట్ల రఘు అన్నారు.రాబోయే రోజుల్లో ప్రతి తండాలో మేరమ్మ యాడి గుడి, అంబేద్కర్ విగ్రహం కట్టిస్తానని హామీ ఇచ్చారు.ఇదివరకే చాలా గ్రామాలలో సొంత ఖర్చులతో నిర్మించాను, అని తెలిపారు.తండా వాసులు మా అందరి మద్దతు మీకే అని సింహం గుర్తుపై మా తండా వాసుల ఓట్లు వేసి మాకు సాయం చేసే మిమ్మల్ని ఎమ్మెల్యే గెలించుకుంటామని తెలిపారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు అలసట చెందకుండా,చలిని మండుటెండని సైతం లెక్కచేయకుండా మీ బతుకులు మార్చడానికి వచ్చిన మీ ఇంటి బిడ్డను అంటూ, అలుపెరగని ప్రజాసేవ లక్ష్యంగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని. సింహం గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే మార్పు అంటే ఏంటో నిరూపిస్తానని తెలిపారు.మోసం చేసే పార్టీలను ప్రజలు నమ్మవద్దని, ఇప్పుడున్న నాయకులు ఏమైనా పార్టీలలో పుట్టినారా అని, మేము సీనియార్టీ నాయకులం అని చెప్పుకునే నాయకులు ప్రజలకు ఏదో చేసాము అని గొప్పలు చెప్పుకునే నాయకులు వారు వారి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమి చేయలేదు అని వారంత గొప్పలు చేస్తే ప్రజలే గెలిపిస్తారు కదా.పార్టీల్లో ఉండి పార్టీ గుర్తులు కూడా తెలియకుండా అయిపోయింది వాళ్ళ పరిస్థితి.అందుకే మన ఊరు వచ్చి మా గుర్తుకు ఓటేయండి అని ప్రచారలు. మళ్లీ ప్రజలు మోసపోవద్దని సింహం గుర్తుకు ఓటేసి మీ కుటుంబ బిడ్డగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలని పిల్లుట్ల రఘు కోరారు....
-----------------------
Admin