సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక శివారు అడవి ప్రాంతం శ్రీరాంపురం ఎస్టి కాలనీలో పాముకాటుతో వెట్టి రాధా (30) మహిళ మృతి చెందింది ఆర్బిఐ పార్టీ జిల్లా నాయకులు , BSSM రాష్ట్ర కార్యదర్శి , ఇస్రం శ్రీను , మాట్లాడుతూ గతంలో ఇద్దరు వ్యక్తులు అనారోగ్యంతో మరణించారు వారికి ఆసుపత్రికి వెళ్లడానికి ఎటువంటి రోడ్డు సౌకర్యం కరెంటు వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గిరిజన ఆదివాసి బిడ్డ పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగాకాంతారావు మెయిన్ రోడ్ లో పక్కన ఉన్నటువంటి రోడ్డును శంకుస్థాపన చేస్తున్నారు కానీ మారుమూల ప్రాంతాలో ఉన్నటువంటి గిరిజన ఆదివాసి బిడ్డలను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు , ప్రభుత్వ అధికారులు, దృష్టి సారించి గ్రామానికి అండగా నిలిచి గ్రామంలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
-----------------------
Admin