Wednesday, 16 September 2026 06:29:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పారిశుద్ధ్యం తోనే పట్టణ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం... - ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

Date : 29 September 2023 05:29 AM Views : 206

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : పారిశుద్ధ్యం తోనే పట్టణ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 18 వ వార్డులో సీసీ రోడ్డు శంకుస్థాపన చేసి స్వచ్చ భారత్ దివస్ , ఇండియన్ స్వచ్చత లీగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ఆర్పిల కష్టాలను గుర్తించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్పీలకు వేతనాలను పెంచి ఆర్పీల పట్ల వారికున్న అభిమానాన్ని చాటటం జరిగిందని అన్నారు.పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల్లో ఉన్న వ్యర్థాలను తొలగించి పట్టణాలు సుందరంగా తీర్చుదిద్దుకోవడం జరిగిందని ఇటీవల సీఎం కేసీఆర్ 25 కోట్లు కేటాయించడం దానికి సంబంధించిన జీవోను కూడా అందించడం జరిగిందని అన్నారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని తాను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సహకారంతో నియోజక వర్గం అభివృద్ధి పదంలో ముందుందని అన్నారు. ఎక్కడికి వెళ్లినా గ్రామాల్లో గతంలో మురుగునీరు ప్రత్యక్షమై వ్యాధులు ప్రభలించవని అన్నారు కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా సిసి రోడ్లు డ్రైనేజీలు ప్రత్యక్షమవుతున్నాయని అన్నారు. దీనివల్ల అంటు వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని తెలిపారు..అక్టోబర్ 1 న ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వచ్ఛత హి సేవ,,, ఏక్ తారీక్,, ఏక్ గంట,, శ్రమధన్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :