సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం నెలకి 26,000 ఇవ్వాలని నాలుగు లేబర్ కోడు ల ను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వ్యవసాయకు ఉపాధి హామీ పథకం కింద రోజుకి 600 రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఫిబ్రవరి 16 2024 జరిగే భారత దేశ వ్యాప్త సమ్మె తో పాటు గ్రామీణ భారత బంధు విజయవంతం చేయాలని టిఎన్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి పిలుపునిచ్చారు.హుజూర్ నగర్ మిర్యాలగూడ రోడ్డు నందు పరిశ్రమల ప్రాంతమైన రైస్ మిల్లు డ్రైవర్లగేట్ మీటింగ్ లో పాల్గొని రోషపతి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాలు వివిధ ఉద్యోగ సంఘాలు అఖిల భారత ఫెడరేషన్ కిసాన్ సంఘ్ ఇచ్చిన పిలుపుతో పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయం వంతం చెయాలి అని కోరారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తో పాటు అంగన్వాడీ మున్సిపల్ ఆశా మిడ్డీ మిల్స్ ఇతర కారిమికుల వెతనాలు పెంచాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో రైస్ మిల్లు డ్రైవర్ టిఎన్టియుసి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు గుండె బోయిన వెంకన్న కంకనాల రామయ్య మామిడి వీరబాబు రామారావు జాని గణేష్ పిచ్చయ్య రమేష్ మలషూరు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin