సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఎలికట్ట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని టి పి సి సి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫరూక్ నగర్ మండల పరిధిలోని ఎలికట్ట గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహాల్ ఎలికట్టకు చెందిన జంగం రాజు, తోకల మధు అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ సోమవారం మహల్ ఎలికట్టకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 5000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ... బంగారు భవిష్యత్తు కలిగిన యువకులను రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించడం ఎంతో బాధాకరమనిఅన్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మమ్మల్ని ఎంతగానో కలిచి వేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చేతికి వచ్చిన చెట్టంత కొడుకులు కళ్ళముందే చనిపోతే ఆ తల్లిదండ్రుల బాధ మాటల్లో చెప్పలేనిదని అన్నారు భవిష్యత్తులో బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కొందుర్గు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎలికట్ట ఎంపీటీసీ సభ్యులు కావలి శ్రీశైలం, నాయకులు బుడ్డ నర్సింహులు, ఆజం, శీను, బుడ్డ సురేష్, కావలి నరేష్, జంగం రాజు, రవీందర్, పకీరయ్య, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin